ఫించ్ ఔట్…సంబరాల్లో కోహ్లీ

200
kohli
- Advertisement -

ఆడిలైడ్ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌,తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 250 పరుగులకు ఆలౌటైంది. ఓవర్ నైట్ స్కోరు 250 పరుగుల వద్దనే భారత కథ ముగిసింది.

అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇషాంత్ వేసిన తొలి ఓవర్‌లోనే విధ్వంసక ఓపెనర్ అరోన్ ఫించ్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా పడిన బంతిని డ్రైవ్ చేసేందుకు అరోన్ ఫించ్ ప్రయత్నించాడు. కానీ.. బ్యాట్‌కి ఎడ్జ్ తీసుకున్న బంతి.. నేరుగా వెళ్లి ఆఫ్, మిడిల్ స్టంప్‌లను గీరాటేసింది.

ఫించ్ ఔట్ కావడంతో కెప్టెన్ కోహ్లీ పండగ చేసుకున్నాడు. తనదైన భావోద్వేగంతో బౌలర్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 45 ఓవర్లలో 96 పరుగులకు 4 వికెట్లు కొల్పోయింది. అశ్విన్ 3 వికెట్లు తీయగా ఇషాంత్ ఒక వికెట్ తీశారు.

- Advertisement -