” గుంటూరు కారం ” కాపీ కథనా ?

31
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ” గుంటూరు కారం “. పక్కా మాస్ అంశాలతో కమర్షియల్ మూవీగా రూపొందుతున్న ఈ మూవీపై రోజుకో రూమర్ చక్కర్లు కొడుతోంది. మొదట త్రివిక్రమ్ వినిపించిన కథ నచ్ఛక పోవడంతో ఈ ప్రాజెక్ట్ ను మహేష్ పక్కన పెట్టేశాడనే టాక్ నడిచింది. కొన్ని రోజులకు కథ మార్చి మరో ఫ్రెష్ కథతో మహేష్ ను ఇంప్రెస్ చేశాడట త్రివిక్రమ్. ఆ తరువాత మహేష్ త్రివిక్రమ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని, మహేష్ సినిమాపై త్రివిక్రమ్ దృష్టి సారించడం లేదనే టాక్ నడిచింది కొన్నాళ్లు.

ఇక నిన్న మొన్నటి వరకు ఈ మూవీ నుంచి హిరోయిన్ పూజా హెగ్డే తప్పుకుందని, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి వాకౌట్ చేశాడని.. అబ్బో ఇలా గుంటూరు కారం మూవీపై వచ్చిన రూమర్స్ అన్నీ ఇన్ని కావు. అయితే ఈ రూమర్స్ అన్నిటిని చిత్రయూనిట్ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా ” గుంటూరు కారం ” మూవీ స్టోరీపై ఓ ఆసక్తికర రూమర్ ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ” గుంటూరు కారం ” మూవీ స్టోరీ లైన్.. గతం లో రామ్ పోతినేని నటించిన ” ఒంగోలు గిత్త ” మూవీ స్టోరీ ఒకటేనని ఓ టాక్ విపరీతంగా వైరల్ అవుతోంది. రామ్ నటించిన ఒంగోలు గిత్త మూవీ కూడా గుంటూరు మిర్చి యార్డ్ నేపథ్యంలోనే సాగుతుంది.

Also Read: 50 శాతం పూర్తి చేసుకున్న ‘OG’

ఇప్పుడు మహేష్ గుంటూరు కారం మూవీ కూడా అదే థీమ్ తో వస్తుండడంతో త్రివిక్రమ్.. రామ్ మూవీని కాపీ కొట్టడంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. మరి దీనిపై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. మొత్తానికి పదమూడేళ్ళ తరువాత మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ రిపీట్ అయిందనే సంతోషంలో ఫ్యాన్స్ ఉంటే.. ఈ మూవీని చుట్టుముడుతున్న రూమర్స్ ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశ పరుస్తున్నాయి. మరి ఈ మూవీ విడుదల తరువాత ఎలాంటి విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.

Also Read: భారీ సెట్‌లో #VT13 సినిమా…

- Advertisement -