రిస్క్ చేస్తున్న గోపిచంద్?

15
- Advertisement -

భీమాతో సక్సెస్ ట్రాక్ అందుకున్నారు హీరో గోపిచంద్. మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమా హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ లావిష్ గా నిర్మించారు. మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అయితే తన తర్వాతి సినిమాల విషయంలో సాహసం చేస్తున్నారు గోపిచంద్. రాధేశ్యామ్ వంటి భారీ డిజాస్టర్‌ సినిమాను ఇచ్చిన రాధాకృష్ణతో సినిమాకు ఓకే చెప్పేశారు. గతంలో గోపిచంద్‌తో జిల్ సినిమా చేశారు గోపిచంద్. 2015లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అయితే తర్వాత తెరకెక్కిన రాధేశ్యామ్ భారీ డిజాస్టర్‌గా మిగిలింది.

ఇప్ప‌టికే ఈ మూవీ స్టోరీ లైన్‌ను గోపీచంద్‌కు వినిపించ‌గా ఓకే చెప్పినట్లు సమాచారం. దీనిపై అఫిషియల్‌ ప్రకటన రావాల్సి ఉండగా ఈ ప్రాజెక్ట్‌ను యూవీ క్రియేషన్స్ నిర్మించ‌నుంది.

Also Read:ఓటీటీలోనూ హనుమాన్ దూకుడు

- Advertisement -