IPL 2023:సన్‌రైజర్స్‌ ఓటమి

49
- Advertisement -

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తీరుమారలేదు. వరుసగా రెండో ఓటమితో ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైంది.హైదరాబాద్ విధించిన 123 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 16 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్(31 బంతుల్లో 35 పరుగులు), కృనాల్ పాండ్యా (23 బంతుల్లో 34 పరుగులు) రాణించారు.

ఇక అంతకముందు బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లు కొల్పోయి 121 పరుగులు చేసింది. త్రిపాఠి(34), అమోల్ ప్రీత్ సింగ్(31), అబ్దుల్ సమద్(21), వాషింగ్టన్ సుందర్ (16) పరుగులు చేశారు. కృనాల్ పాండ్యా 3 , అమిత్ మిశ్రా 2 వికెట్లు పడగొట్టాడు. యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీశారు.

లక్నో జట్టుకి ఈ సీజన్ లో ఇది రెండో విజయం. తొలి మ్యాచ్ లో ఢిల్లీ కేపిటల్స్ పై గెలుపొందిన లక్నో రెండో మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -