సూర్య అదుర్స్..ముంబై ఘనవిజయం

47
- Advertisement -

ఐపీఎల్ 2023లో భాగంగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఘన విజయం సాధించింది.219 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్..నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కొల్పోయి 191 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైన రషీద్ ఖాన్ సిక్సర్ల వర్షంతో విరుచుకపడ్డాడు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరగడంతో గుజరాత్ ఓటమి తప్పలేదు.32 బంతుల్లో 3 ఫోర్లు,10 సిక్స్‌లతో ర‌షీద్ ఖాన్‌(79 నాటౌట్‌), డేవిడ్ మిల్ల‌ర్‌(41; 26 బంతుల్లో 4 ఫోర్లు, 2సిక్స‌ర్లు), విజ‌య్ శంక‌ర్‌(29; 14 బంతుల్లో 6 ఫోర్లు)లు రాణించారు.

Also Read:కాంగ్రెస్ కు భయం పట్టుకుందా ?

ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియ‌న్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 218 ప‌రుగులు చేసింది. సూర్య‌కుమార్ యాద‌వ్ 49 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స‌ర్లతో 103 ప‌రుగులతో అజేయంగా నిలిచాడు. ఆఖరి బంతికి సిక్స్‌ కొట్టి సెంచరీ చేశాడు సూర్య. ఐపీఎల్‌లో ఇది సూర్యకు తొలి సెంచరీ. ఇషాన్ కిష‌న్‌(31; 20 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌). విష్ణు వినోద్‌(30; 20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), ఇష‌న్ కిష‌న్‌(31; 20బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు.

Also Read:హంగ్ వస్తే.. జేడీఎస్ ప్లాన్ అదే !

2 మ్యాచుల్లో 7 విజ‌యాలు సాధించి 14 పాయింట్ల‌తో మూడో స్థానానికి ఎగ‌బాకింది ముంబై.

- Advertisement -