IPL 2023:ఫైనల్లో గుజరాత్

30
- Advertisement -

ఐపీఎల్ 2023లో భాగంగా వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరింది డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్. అహ్మదాబాద్ వేదికా నరేంద్రమోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబైని చిత్తు చేసింది గుజరాత్. 234 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 18.2 ఓవర్లలో 171 పరుగులకే ఆలౌట్ అయి 62 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

సూర్య‌కుమార్ యాద‌వ్‌(61; 38 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) అర్ధ‌శ‌త‌కంతో దంచికొట్ట‌గా తిల‌క్ వ‌ర్మ‌(43; 14 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) రాణించారు. మిగితా బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యారు.

Also Read:దొండకాయ తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో.. !

ఇక అంత‌క‌ముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు న‌ష్ట‌పోయి 233 ప‌రుగులు చేసింది. శుభ్‌మ‌న్ గిల్ (129; 60 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స్‌లు) సెంచరీ చేయగా సాయి సుదర్శన్‌ (43), హార్దిక్‌ పాండ్య (28*) రాణించారు. ఆదివారం చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనుంది గుజరాత్.

- Advertisement -