దుబాయ్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు.. కొత్త షెడ్యూల్‌ ఇదే..

148
- Advertisement -

కోవిడ్ సెకండ్ వేవ్ వ్యాప్తి నేపథ్యంలో ఇటీవల ఐపీఎల్ 14వ సీజన్ అర్థాంతరంగా నిలిచిపోయింది. అయితే ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్ లు దుబాయ్‌లో నిర్వహించాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నిర్ణయించింది. తాజాగా దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారు చేసింది.

భారత్‌లో ఐపీఎల్ 14వ సీజన్ కు సంబంధించి 29 మ్యాచ్ లు జరగ్గా, మిగిలిన 31 మ్యాచ్ లను దుబాయ్ వేదికగా నిర్వహిస్తారు. సెప్టెంబరు 19న ఐపీఎల్ పోటీలు షురూ అవుతాయి. అక్టోబరు 15న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. కాగా, ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్ లకు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఆటగాళ్లు వచ్చేది అనుమానంగా మారింది. తాము రాలేమంటూ ఇప్పటికే పలువురు ఆటగాళ్లు సంకేతాలిచ్చారు. దీనిపై బీసీసీఐ ఎలా స్పందిస్తుందన్నది చూడాలి.

- Advertisement -