18 సంవత్సరాల తర్వాత రేణు…రీ ఎంట్రీ

119
renu
- Advertisement -

18 సంవత్సరాల తర్వాత నటి రేణు దేశాయ్ రీ ఎంట్రీ అదిరింది. మాస్ రాజా రవితేజ నటిస్తున్న ‘టైగర్ నాగేశ్వర రావు’ సినిమాలో రీఎంట్రీ ఇస్తోంది. రేణు దేశాయ్ పాత్రకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను చిత్ర యూనిట్ రివీల్ చేసింది.

ఈ సినిమాలో ప్రముఖ సామాజిక వేత్త ‘హేమలతా లవణం’ పాత్రలో రేణు దేశాయ్ నటించబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాలో రవితేజ పాత్ర కూడా చాలా రియలిస్టిక్ గా ఉండనుంది. యంగ్ డైరెక్టర్ వంశీ తెరకెక్కిస్తుండగా, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

- Advertisement -