ఉమెన్స్ డే స్పెషల్ :మహిళామణులు వీరే..

195
International womens day on 8th
- Advertisement -

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో కృషి చేసిన 24 మంది మహిళలను అవార్డులతో సత్కరించనుంది. సామాజిక సేవ, విద్య, వ్యవసాయం, సాహిత్యం, వృత్తి సేవలతో పాటు వివిధ రంగాల్లో కృషి చేసిన వారితో పాటు తెలంగాణ మహిళా ఉద్యమకారిణిలకు ప్రభుత్వం పురస్కారాలు ప్రకటించింది. తెలంగాణ ఉద్యమ పాటలు రాసిన ఇద్దరికి, పాత్రికేయ రంగంలో ముగ్గురికి అవార్డ్స్ వరించాయి.

విద్యారంగం : డాక్టర్ విద్యావతి(కాకతీయ యూనివర్సిటీకి ఉపకులపతిగా పని చేశారు. తెలంగాణలో తొలిసారిగా విద్యావతినే ఉపకులపతిగా బాధ్యతలు స్వీకరించారు. వరంగల్)
నృత్యం : వనజా ఉదయ్(హైదరాబాద్)
చిత్రలేఖనం : అంజనీరెడ్డి(జహీరాబాద్)
సంగీతం : పాయల్ కొట్గరీకర్(నిజామాబాద్)
సామాజిక సేవ : జానకి(హైదరాబాద్), దేవకీదేవి(మహబూబ్‌నగర్), గాయత్రి(వనపర్తి), లక్ష్మీబాయి(ఆదిలాబాద్)
వ్యవసాయం : సుగుణమ్మ(జనగామ), నాగమణి(నల్లగొండ)
తెలంగాణ ఉద్యమకారులు :ఎస్. మణమ్మ(ఉప్పల్), ధాత్రిక స్వప్న(ఓయూ విద్యార్థి, హైదరాబాద్), మూల విజయారెడ్డి(పెద్దపల్లి)
వృత్తిసేవలు : ప్రమీల, న్యాయవాది(మంచిర్యాల)
సాహిత్యం : రజిత(వరంగల్), షాజహాన(ఖమ్మం)
సర్పంచ్ లు : ఎం. పద్మ(కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామం), కె. లక్ష్మి(సిద్ధిపేట జిల్లా ఇబ్రహీంపూర్ గ్రామం)
తెలంగాణ ఉద్యమ పాటలు : చైతన్య(నల్లగొండ), స్వర్ణ(కరీంనగర్)
క్రీడలు : ప్రియదర్శిని(కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ లో బంగారు పతకం కైవసం, స్వస్థలం వరంగల్)
పాత్రికేయ రంగం : మాడపాటి సత్యవతి(రేడియోలో తొలిసారిగా వార్తలు చదివిన మహిళ ఈవిడే. హైదరాబాద్), కట్టా కవిత(నల్లగొండ), జి. మల్లీశ్వరి(మహిళల్లో ప్రథమ వీడియో జర్నలిస్టు, వరంగల్)

- Advertisement -