దాసరి … ఈజ్ బ్యాక్

211
Interesting conversation between Chiru and Dasari
- Advertisement -

దర్శకరత్న దాసరి నారాయణ రావు కొలుకుంటున్నారని … త్వరలోనే ఆయన అందరి ముందుకు వస్తారని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. కిమ్స్‌లో చికిత్స పొందుతున్న దాసరిని పరామర్శించిన చిరు ఆయన ఆసుపత్రిలో చేరిన అనంతరం జరిగిన పరిణామాలపై భయాందోళనలకు గురయ్యామని తెలిపారు. హుషారైన దాసరిని చూస్తున్నామని చాలా సంతోషంగా ఉందన్నారు.

ఖైదీ నంబర్ 150 విజయోత్పవ సభకు మీరే ముఖ్య అతిథిగా రావాలని దాసరికి విజ్ఞప్తి చేశా. మీరు వచ్చే వరకు విజయోత్సవ సభను వాయిదా వేస్తానని దాసరికి చెప్పినట్లు చిరంజీవి వెల్లడించారు. నాలుగు రోజుల్లోనే దాసరి ఇంటికి తిరిగి వెళ్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. తాను నటించిన సినిమా ‘ఖైదీ నెంబర్ 150  కలెక్షన్ల వివరాలు చెప్పడం జరిగిందని, త్వరలో ఓ సభను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నట్లు దాసరికి తెలపడం జరిగిందన్నారు. ఇందుకు ఖచ్చితంగా రావాలని కోరడం జరిగిందని, ఇందుకు ఖచ్చితంగా వస్తానని లెటర్ పై రాయడం జరిగిందన్నారు.

apcm babu

దాసరి మానసిక స్థైర్యం ఒక ఎత్తు అని, మందులు మరొక ఎత్తు అని వైద్యులు పేర్కొన్నారని తెలిపారు. వైద్యులు చేస్తున్న వైద్యం ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. చిరంజీవితోపాటు అల్లుఅరవింద్, వివి వినాయక్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు,మోహన్‌బాబు దంపతులు, జయప్రద దాసరిని పరామర్శించారు. మరోవైపు దాసరి ఆరోగ్యంపై వైసీపీ అధినేత జగన్, కేంద్రమంత్రి దత్తాత్రేయ, వీహెచ్‌, అంబటి రాంబాబు తదితరులు ఆరా తీశారు.

- Advertisement -