- Advertisement -
టోక్యో ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధించారు భారత స్విమ్మర్ సాజన్ ప్రకాశ్. ఏ-క్వాలిఫికేషన్ మార్కును అధిగమించి విశ్వక్రీడలకు నేరుగా క్వాలిఫై అయిన తొలి భారత స్విమ్మర్గా చరిత్ర సృష్టించాడు.
ఇటలీలోని రోమ్ వేదికగా జరిగిన సెటెకోలీ ట్రోఫీ 200 మీటర్ల బటర్ఫ్లై విభాగంలో సాజన్ ఒక నిమిషం 56 సెకన్లలోనే గమ్యాన్ని చేరి.. టోక్యో ఒలింపిక్స్కు ‘ఏ’ స్టాండర్డ్లో క్వాలిఫై అయ్యాడు. క్వాలిఫయర్స్ ద్వారా 2016 రియో ఒలింపిక్స్లో సాజన్ బరిలోకి దిగాడు. ఇక టోక్యో ఒలింపిక్స్లో సాజన్తో పాటు భారత్ తరఫున మాన పటేల్ కూడా పాల్గొననున్నారు.
- Advertisement -