రెండో టెస్ట్ లో భారత్ ఘన విజయం

328
india-bangla-
- Advertisement -

కోల్ కత్తాలోని ఈడెన్ గార్జెన్ లో బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ పై ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 195 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 30.3 ఓవర్లలోనే 106 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం తన తొలి ఇన్నింగ్స్ ఆడిన భారత్ 89.4 ఓవర్లలో 9 వికెట్లను కోల్పోయి 347 పరుగులకు ఇన్నింగ్స్ డిక్లేర్‌ ఇచ్చి బంగ్లాపై భారీ ఆధిక్యాన్ని సాధించింది.

ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాదేశ్ 41.1 ఓవర్లలో 195 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. దీంతో భారత్ సునాయాసంగా ఈ టెస్టులో విజయం సాధించింది. ఈ క్రమంలో భారత్ 2-0 తేడాతో మరో టెస్టు సిరీస్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ రెండు ఇన్నింగ్స్‌లలోనూ కలిపి 9 వికెట్లు తీయగా, మరొక బౌలర్ ఉమేష్ యాదవ్ 8 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

- Advertisement -