U-19 టీమ్‌కు అభినందలన వెల్లువ…

204
- Advertisement -

న్యూజీలాండ్ లోని బే ఓవల్‌ మైదానంలో ఇవాళ జరిగిన అండర్ 19 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో భారత ఆటగాళ్లు విక్టరీ సాధించిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించి నాలుగోసారి విశ్వవిజేత‌గా నిలిచింది భారత అండర్ 19 క్రికెట్ జట్టు.

అంతేకాదు అత్య‌ధిక ప్ర‌పంచ‌క‌ప్‌లు నెగ్గిన జ‌ట్టుగా భార‌త్ జట్టు రికార్డు నెలకొల్పింది. దీంతో దేశమంతా సంబరాలు మిన్నంటుతున్నాయి. దేశంలోని సినీ, రాజకీయ ప్రముఖులు భారత జట్టుకు శుభాకాంక్షలు వెల్లువలా తెలుపుతున్నారు.

 India win U-19 World Cup: Who said what on Twitter

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. అండర్ -19 టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ టీమ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌ను అభినందించారు. ఈ గెలుపును ప్రతి భారతీయుడు గర్వంగా ఫీలవుతున్నారని పేర్కొన్నారు.

కాగా..సినీనటుడు మహేష్‌బాబు కూడా భారత ఆటగాళ్లకు ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ‘ఇది దేశమంతా గర్వపడే సందర్భం. భారత అండర్ 19 ఆటగాళ్లు ఓ అద్భుతం సృష్టించారు. కంగ్రాట్స్ టు యంగ్ హీరోస్..’ అంటూ ట్వీట్ చేశారు.

- Advertisement -