బ్యాడ్మింటన్‌లో భారత్‌కు రజతం

87
sindhu
- Advertisement -

కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత ఆటగాళ్లు సత్తాచాటుతున్నారు. బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ విభాగంలో భారత జట్టు రజతం సాధించింది. ఫైనల్లో మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో 1-3 తేడాతో ఓటమి పాలైంది. పీవీ సింధు మాత్ర‌మే మ‌లేషియాతో జ‌రిగిన మ‌హిళల సింగిల్స్‌లో త‌న మ్యాచ్‌ను నెగ్గింది.

తొలి మ్యాచ్‌లో చిరాగ్ శెట్టి, సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డిలు పోరాడు ఓడారు. ఆ ఇద్ద‌రూ టెంగ్ ఫాంగ్‌, వూయి ఇక్ చేతిలో 21-18, 21-15 స్కోర్‌తో ఓడిపోయారు. ఇక రెండ‌వ మ్యాచ్‌లో పీవీ సింధు 22-20, 21-17 తేడా స్కోర్‌తో జిన్ వెయి గోపై విజ‌యం సాధించింది. ఇక మూడ‌వ మ్యాచ్‌లో కిదాంబి శ్రీకాంత్ 19-21, 21-6, 16-21 స్కోర్‌తో నెగ్ తెజ్ యాంగ్ చేతిలో ఓట‌మి పాల‌య్యారు.

- Advertisement -