విండీస్‌‌తో టిమిండియా తొలి టీ20 నేడే

463
india vs westindies
- Advertisement -

ప్రపంచకప్‌లో ఓటమి తర్వాత వెస్టిండీస్ టూర్‌కి సిద్ధమైంది కోహ్లీ సేన. విండీస్‌ టూర్లో భాగంగా ఇవాళ తొలి టీ20 జరగనుంది. ఆటగాళ్ల మధ్య విభేదాలపై ఓవైపు చర్చ జరుగుతుండగా, ఆటతోనే వాటికి సమాధానం చెప్పాలని విరాట్‌‌సేన భావిస్తోంది. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుండగా మ్యాచ్‌‌కు వర్షం ముప్పు ఉండడం ఇరు జట్లను ఆందోళన కలిగిస్తోంది.

వరల్డ్ కప్‌లో గాయపడ్డ ఓపెనర్ శిఖర్ ధవన్‌ మళ్లీ తుది జట్టులోకి రానున్నాడు. ధోనీ స్థానంలో జట్టులోకి వచ్చిన రిషబ్‌‌ పంత్‌‌ తనెంటో నిరూపించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు.

స్టార్‌‌ ఆల్‌‌రౌండర్‌‌ ఆండ్రీ రసెల్‌‌ చివరి నిమిషంలో తొలి రెండు టీ20లకు దూరం కావడం విండీస్‌కు ప్రతికూలంగా మారింది. అయితే బౌలింగ్‌‌లో ఒషానే థామస్‌‌, సునీల్‌‌ నరైన్‌‌, షెల్డన్‌‌ కొట్రేల్‌‌, కీమో పాల్‌‌ లతో బలంగా ఉంది.

జట్లు (అంచనా):

ఇండియా: కోహ్లీ (కెప్టెన్‌‌), రోహిత్‌‌, ధవన్‌‌, రాహుల్‌‌, పాండే/అయ్యర్‌‌, పంత్‌‌, జడేజా/క్రునాల్‌‌, భువనేశ్వర్‌‌, ఖలీల్‌‌, దీపక్‌‌/నవదీప్‌‌, రాహుల్‌‌ చహర్‌‌

వెస్టిండీస్: బ్రాత్‌‌వైట్‌‌ (కెప్టెన్‌‌), లూయిస్‌‌, హెట్‌‌మయర్‌‌, పొలార్డ్‌‌, పూరన్‌‌, రోమన్‌‌ పావెల్, జాన్‌‌ క్యాంప్‌‌బెల్‌‌, నరైన్‌‌, కొట్రెల్‌‌, కీమో పాల్‌‌/థామస్‌‌, పైర్‌‌

- Advertisement -