లక్నో వేదికగా శ్రీలంకతో భారత్ టీ20..

124
t20
- Advertisement -

శ్రీలంకతో లక్నో వేదికగా ఇవాళ టీ20 మ్యాచ్ జరగనుంది. రాత్రి 7 గంటలకు తొలి టీ20 మ్యాచ్ జరగనుండగా సీనియర్ ఆటగాళ్లు ఈ మ్యాచ్‌కు దూరమయ్యారు. విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ చాహర్ వంటి కీలక ఆటగాళ్లు దూరంకాగా యువ ఆటగాళ్లకు ఇది కీలకం కానుంది.

శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, వెంకటేష్ అయ్యర్ లాంటి ప్రతిభావంతులకు తుది జట్టులో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్‌కు ఛాన్స్ దక్కనుంది. పేస్ బాధ్యతలను భువనేశ్వర్, హర్షల్ పటేల్ పంచుకోనుండగా స్పిన్నర్లుగా రవీంద్ర జడేజా, చాహల్ బరిలో దిగనున్నారు.

ఇక శ్రీలంక సైతం భారత్‌ను ఓడించాలని ఉవ్విళ్లూరుతోంది.ఇందుకోసం పటిష్ట జట్టుతో బరిలోకి దిగనుంది శ్రీలంక.

- Advertisement -