దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు భారత జట్టు ఇదే..

616
team india
- Advertisement -

ఐపీఎల్ తాజా సీజన్ కు ముందు భారత పురుషుల జట్టు దక్షిణాఫ్రికాతో మూడు వన్డే మ్యాచ్ లు ఆడనుంది. మార్చి 12 నుంచి 18వ తేదీ వరకు భారత్ లోని పలు వేదికల్లో ఈ మ్యాచ్ లు జరుగుతాయి. తాజాగా ఈ సిరీస్ కోసం భారత జట్టును ఎంపిక చేశారు. విరాట్ కోహ్లీ సారథ్యం వహిస్తాడు. ఇక, దక్షిణాఫ్రికా జట్టు ఈ సిరీస్ కోసం నేడు భారత్ బయల్దేరింది. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి వన్డే మార్చి 12న ధర్మశాలలో, రెండో వన్డే మార్చి 15న లక్నోలో, చివరిదైన మూడో వన్డే మార్చి 18న కోల్ కతాలో జరగనున్నాయి.

భారత జట్టు: శిఖర్‌ ధావన్‌, పృథ్వీ షా, విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, మనీశ్‌ పాండే, శ్రేయాస్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, భువనేశ్వర్‌ కుమార్‌, యుజువేంద్ర చాహల్‌, బుమ్రా, నవదీప్‌ సైనీ, కుల్దీప్‌ యాదవ్‌, శుభమన్‌ గిల్‌

- Advertisement -