దక్షిణాఫ్రికాతో టీమిండియా తొలి టెస్టు..నేటి నుంచే

507
kohli
- Advertisement -

మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇవాళ సౌతాఫ్రికాతో తొలిటెస్టు ఆడనుంది టీమిండియా. విశాఖ వేదికగా జరుగనున్న తొలి టెస్టులో బోణి కొట్టాలని కోహ్లీ సేన బరిలోకి దిగుతుండగా స్వదేశంలో తిరుగులేని టీమిండియాకు ఎలాగైనా చెక్ పెట్టాలని ప్రోటీస్ పక్కా వ్యూహంతో బరిలోకి దిగుతోంది.

అయితే ఈ టెస్టు మ్యాచ్‌కి వర్షం ముప్పు పొంచి ఉంది. మొదటి టెస్టులో తొలిరోజైన బుధవారం వైజాగ్‌లో 80 శాతం వర్షం కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రెండో రోజు 50 శాతం, మూడో రోజు 40 శాతం వర్ష సూచనలు ఉన్నాయి. దీంతో మ్యాచ్‌ పూర్తిగా జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి.

ఇప్పటివరకు విశాఖపట్నం స్టేడియం కేవలం ఒక్క టెస్టు మ్యాచ్‌కి మాత్రమే ఆతిథ్యమిచ్చింది. స్పిన్నర్లు వికెట్ల పండగ చేసుకున్న ఆ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై 246 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. సఫారీలతో బుధవారం నుంచి జరగనున్న తొలి టెస్టు మ్యాచ్‌లోనూ పిచ్‌ స్పిన్నర్లకి అనుకూలించే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే భారత్‌ను తమ సొంత గడ్డపైనే ఓడించాలని మొక్కోవొని పట్టుదలతో ఉన్నారు సఫారీలు. ఒక వేళ మ్యాచ్ జరిగితే విజయం ఎవరిని వరిస్తుందోనని ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -