భారత్ – పాక్‌ టీ20..టికెట్లు బుకింగ్ క్లోజ్!

67
pak
- Advertisement -

ఆసీస్ వేదికగా ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే టికెట్ల విక్రయాలు ప్రారంభంకానుండగా భారత్-పాకిస్థాన్ మరోసారి తలపడనున్నాయి. దీంతో ఇప్పటికే ఈ మ్యాచ్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉండగా అక్టోబర్ 23న జరిగే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ టిక్కెట్ల విక్రయాలు అలా మొదలయ్యాయో లేదో.. గంటల్లోనే టిక్కెట్లన్నీ అమ్ముడుపోయాయి.

ప్రపంచకప్ టిక్కెట్లను ఫైనల్‌తో సహా మొత్తం 45 మ్యాచ్‌ల టికెట్లను అధికారులు విక్రయానికి ఉంచారు. పిల్లలకు 5 డాలర్లు (రూ. 373), పెద్దలకు 20 డాలర్లు (రూ.1,493) నిర్ణయించారు. అడిలైడ్, బ్రిస్బేన్, జీలాంగ్, హోబర్ట్, మెల్‌బోర్న్, పెర్త్, సిడ్నీలు వేదికలుగా టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు జరుగుతాయి. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు ఈ మెగా టోర్నీని ఐసీసీ నిర్వహించనుంది.

- Advertisement -