ఉప్పల్ వేదికగా తొలి వన్డే..

10
- Advertisement -

భారత్ – న్యూజిలాండ్ మధ్య ఉప్పల్ వేదికగా ఇవాళ తొలి వన్డే జరగనుంది. ఇందుకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదిక కానుండగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.

మూడు మ్యాచుల సిరీస్ లో భాగంగా ఇవాళ తొలి వన్డే జరగనుండగా హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ కు సొంతగడ్డపై ఇది తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్.
గాయం కారణంగా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ సిరీస్ కు దూరం కాగా, అతని స్థానంలో సూర్యకుమార్ తుది జట్టులో చోటు దక్కనుంది.

మ్యాచ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు 2,500 మంది పోలీసులతో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సెల్‌ఫోన్ మినహా ఇతర వస్తువులకు స్టేడియంలోకి అనుమతి లేదు. పాసులు, టిక్కెట్లు, బీసీసీఐ అనుమతించిన కార్డులు ఉన్న వారికి మాత్రమే స్టేడియంలోకి రావడానికి అనుమతి ఉంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -