ఐర్లాండ్‌తో టీ20..బుమ్రా రీ ఎంట్రీ

32
- Advertisement -

ఏడాది తర్వాత భారత జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్నారు జస్పిత్ బుమ్రా. శస్త్రచికిత్స అనంతరం పూర్తిగా కోలుకున్న బుమ్రా.. ఐర్లాండ్‌తో నేడు జరుగనున్న తొలి టీ20లో భారత జట్టు కెప్టెన్‌గా పునరాగమనం చేయనున్నాడు. యువ ఆటగాళ్లతో కూడిన జట్టు ఐర్లాండ్‌తో తలపడనుంది.

రుతురాజ్‌ గైక్వాడ్‌, రింకూ సింగ్‌తో తిలక్‌ వర్మ, యశస్వి జైస్వాల్‌ జట్టులో స్ధానం దక్కనుంది. పేస్‌ బౌలర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ కూడా జట్టులో తిరిగి చేరనున్నాడు. బుమ్రాతో పాటు ప్రసిద్ధ్‌కృష్ణ, అర్ష్‌దీప్‌ సింగ్‌ పేస్‌ భారాన్ని మోయనుండగా.. స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌గా రవి బిష్ణోయ్‌ తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.

ఇన్నాళ్లు ఆటకు దూరంగా ఉండటం చాలా కష్టంగా అనిపించిందని తెలిపారు బుమ్రా. కెరీర్‌లో ఇంత సుదీర్ఘ కాలం మైదానం బయట ఎప్పుడూ కూర్చోలేదు…వన్డే ప్రపంచకప్‌లో ఆడాలనే లక్ష్యంతోనే కఠోర సాధన చేసి తిరిగి జట్టులోకి వచ్చానని తెలిపాడు. ఆటగాళ్లంతా ఉత్సాహంగా ఉన్నారని…. మాపై ఎలాంటి ఒత్తిడి లేదన్నారు.

Also Read:వేపాకుతో వీటికి చెక్?

- Advertisement -