టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్..

197
India vs Bangladesh
- Advertisement -

ఏషియా కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న సూపర్ 4 మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది భారత జట్టు. ఇక్కడ ఇప్పటికే రెండు మ్యాచులు ఆడిన ఇండియా, చేజింగ్ ఈజీగా ఉండటం వల్ల మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నట్లు రోహిత్ చెప్పాడు. ఇక ఈ మ్యాచ్‌కు ఒక మార్పుతో బరిలోకి దిగింది.

India vs Bangladesh

గాయపడిన హార్దిక్ పాండ్యా స్థానంలో రవీంద్ర జడేజా టీమ్‌లోకి వచ్చాడు. అటు బంగ్లాదేశ్ ఈ మ్యాచ్‌కు రెండు మార్పుల‌తో బ‌రిలోకి దిగుతున్న‌ది. ముష్ఫిక‌ర్ ర‌హీమ్‌, ముస్త‌ఫిజుర్ రెహ‌మాన్ టీమ్‌లోకి వ‌చ్చారు. అటు మ‌రో మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది ఆఫ్ఘ‌నిస్థాన్‌.

- Advertisement -