ఫస్ట్ టెస్ట్‌.. తొలి రోజు భారత్‌ 233/6

204
India
- Advertisement -

గురువారం ఆస్ట్రేలియాతో అడిలైడ్‌లో జరుగుతున్న పింక్ బాల్ డేనైట్ టెస్టు మ్యాచ్‌లో భారత్ ఆశించినపరుగులు చేయలేకపోయింది. తొలి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి కోహ్లి సేన 6 వికెట్ల‌కు 233 ప‌రుగులు చేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఈ మ్యాచ్‌లో ఓపెన‌ర్లుగా వ‌చ్చిన పృథ్వి షా (0), మ‌యాంక్ అగ‌ర్వాల్ (17) విఫ‌ల‌మ‌య్యారు. ఇన్నింగ్స్ రెండో బంతికే పృథ్వి షా డ‌కౌట‌య్యాడు. కెప్టెన్ కోహ్లి ర‌నౌట‌య్యాడు. ప్ర‌ధాన బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి, పుజారా, ర‌హానే కాసేపు పోరాడినా.. భారీ స్కోర్లు చేయలేక‌పోయారు.32 ప‌రుగుల‌కే 2 వికెట్లు కోల్పోయిన స‌మ‌యంలో కెప్టెన్ విరాట్ కోహ్లి, పుజారా ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దారు. ఈ ఇద్ద‌రూ ఆచితూచి ఆడుతూ భారీ భాగ‌స్వామ్యం నిర్మించే ప్ర‌య‌త్నం చేశారు. ఇద్ద‌రూ క‌లిసి మూడో వికెట్‌కు 68 ప‌రుగులు జోడించిన త‌ర్వాత ల‌య‌న్ బౌలింగ్‌లో పుజారా (43) ఔట‌య్యాడు.

ఆ త‌ర్వాత కోహ్లితో క‌లిసిన ర‌హానే మ‌రో మంచి పార్ట్‌న‌ర్‌షిప్ నెల‌కొల్పాడు. ఈ క్ర‌మంలో హాఫ్ సెంచ‌రీ చేసిన కోహ్లి.. సెంచ‌రీ వైపు దూసుకెళ్తుండ‌గా 74 ప‌రుగుల ద‌గ్గ‌ర ర‌నౌట‌య్యాడు. దీంతో 88 ప‌రుగుల నాలుగో వికెట్ భాగ‌స్వామ్యానికి తెర‌ప‌డింది. ఆ వెంట‌నే ర‌హానే (42), హ‌నుమ విహారీ(16) కూడా పెవిలియ‌న్‌కు చేరారు. ఆట ముగిసే స‌మ‌యానికి సాహా (9), అశ్విన్ (15) క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌లో మిచెల్ స్టార్క్ 2, క‌మిన్స్‌, హేజిల్‌వుడ్‌, నేథ‌న్ ల‌య‌న్ త‌లా ఒక వికెట్ తీసుకున్నారు.

- Advertisement -