దేశంలో కొత్తగా 39,742 కరోనా కేసులు..

175
- Advertisement -

దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 39,742 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,13,71,901కు చేరింది. ఇందులో 4,08,212 కేసులు యాక్టివ్‌గా ఉండగా, మరో 4,20,551 మంది బాధితులు మహమ్మారి వల్ల మరణించారు. మొత్తం కేసుల్లో 3,05,43,138 మంది బాధితులు కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా, శనివారం ఉదయం నుంచి ఇప్పటివరకు 39,972 మంది కోలుకోగా, కొత్తగా 535 మంది మృతిచెందారని తెలిపింది. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా కొనసాగుతున్నది. ఇప్పటివరకు 43,31,50,864 మందికి వ్యాక్సిన్‌ పంపిణీ చేశామని తెలిపింది.

- Advertisement -