రెండో టీ20లో భారత్ ఓటమి..

88
ind
- Advertisement -

విండీస్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ ఓటమి పాలైంది. భారత్ విధించిన 139 పరుగుల లక్ష్యాన్ని విండీస్ 19.2 ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసి విజయం సాధించింది. బ్రాండన్ కింగ్ (68), డెవాన్ థామస్ (31 నాటౌట్) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. కైల్ మేయర్స్ (8), నికోలస్ పూరన్ (14), షిమ్రాన్ హెల్మెయర్ (6), రావ్‌మెన్ పావెల్ (5), ఒడియన్ స్మిత్ (4 నాటౌట్) పరుగులు చేశారు.

ఇక అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టును విండీస్ పేసర్ ఓబెడ్ మెకాయ్ ముప్పుతిప్పలు పెట్టాడు. మ్యాచ్ తొలి బంతికే రోహిత్ శర్మ (0)ను పెవిలియన్ చేర్చిన అతను.. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ (11)ను కూడా అవుల్ చేశాడు. శ్రేయాస్ అయ్యర్ (10) ,రిషభ్ పంత్ (24),హార్దిక్ పాండ్యా (31), రవీంద్ర జడేజా (27) పరుగులు చేశారు.

- Advertisement -