8 లక్షల 50 వేలకు చేరిన కరోనా కేసులు..

151
corona in delhi
- Advertisement -

భారత్‌లో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో 28,637 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 551 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 8,49,553కు చేర‌గా ఇప్పటివరకు 22,674 మంది మృత్యువాతపడ్డారు. ఇక దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,92,258 ఉండగా కరోనా మహమ్మారి నుండి 5,34,621 మంది కోలుకున్నారు.

మ‌హారాష్ట్రలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు మహారాష్ట్రలో 2,46,600 పాజిటివ్ కేసులు నమోదుకాగా 10,116 మంది మృతిచెందారు. త‌మిళ‌నాడులో 1,34,226 కేసులు నమోదుకాగా 1,898 మరణాలు సంభవించాయి.

కొవిడ్ విల‌య‌తాండ‌వానికి దేశ జ‌లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. కేంద్ర‌, రాష్ర్ట ప్ర‌భుత్వాలు క‌రోనా నియంత్ర‌ణ‌కు ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి.

- Advertisement -