24 గంటల్లో 14,933 కేసులు..312 మంది మృతి

191
india coronavirus cases
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 14,933 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 312 మంది మృతిచెందారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 4,40,215కు చేరగా వివిధ ఆస్పత్రుల్లో 1,78,014 మంది చికిత్స పొందుతున్నారు.

కరోనా మహమ్మారి నుండి 2,48,190 మంది కొలుకుని డిశ్చార్జ్ కాగా ఇప్పటివరకు 14,011 మంది మృతిచెందారు. వరుసగా 12వ రోజూ దేశంలో 10వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.

ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 91 లక్షల మార్క్‌ దాటింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 91,92,712 మందికి వైరస్‌ సోకింది. కరోనా బారినపడి 4,74,445 మంది మృత్యువాతపడ్డారు.అమెరికాలో 23,88,153 కేసులు, బ్రెజిల్‌లో 11,11,348, రష్యాలో 5,92,280 కేసులు నమోదయ్యాయి.

- Advertisement -