లక్షా 65 వేలకు చేరిన కరోనా కేసులు..

199
corona cases
- Advertisement -

దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకి విస్తరిస్తోంది. ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 1,65,799కు చేరగా 4,706 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో కరోనాతో 175 మంది చనిపోయారు. కొత్తగా 7,466 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. కరోనా నుండి 71,105 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

మహారాష్ట్రలో అత్యధికంగా 59,546 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 1,982 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో 19,372 కేసులు నమోదుకాగా 148 మంది మృతిచెందారు.

ఢిల్లీలో 16,281 కేసులు నమోదుకాగా 316 మంది మృతిచెందారు. గుజరాత్‌లో 15,572 కేసులు నమోదుకాగా 960 మంది మృతి చెందారు. తెలంగాణలో 2,256 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.

- Advertisement -