దేశంలో ఒక్కరోజే 50వేల కరోనా కేసులు…

174
ap corona cases
- Advertisement -

దేశంలో కరోనా పాజటివ్ కేసుల సంఖ్య 13 లక్షలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో 50 వేలకు చేరువలో కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంట‌ల్లో రికార్డు స్థాయిలో 49,310 మంది క‌రోనా సోకగా 720 మంది మృత్యువాతపడ్డారు.

ఇక ఇప్పటివరకు దేశంలో క‌రోనా కేసుల సంఖ్య 12,87,945కు చేరగా ప్రస్తుతం 4,40,135 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 8,17,209 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకోగా 30,601 మంది చ‌నిపోయారు.

ఇప్పటివ వ‌ర‌కు 1,54,28,170 కరోనా టెస్టులు నిర్వహించామని నిన్న ఒక్కరోజే 3,52,801 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని ఇండియ‌న్ మెడిక‌ల్ కౌన్సిల్ (ఐసీఎమ్మార్‌) ప్ర‌క‌టించింది.

- Advertisement -