దేశంలో 24 గంటల్లో 12,143 కరోనా కేసులు…

160
covid
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. గత 24గంటల్లో 12,143 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 103 మంది మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,08,92,746కు చేరింది.

ప్రస్తుతం దేశంలో 1,36,571 యాక్టివ్ కేసులుండగా ఇప్పటి వరకు 1,06,00,625 మంది కోలుకున్నారు. కరోనాతో ఇప్పటివరకు 1,55,550 మంది మృతి చెందారు. కరోనా వ్యాక్సినేషన్‌లో భాగంగా ఇప్పటి వరకు 79,67,647 మందికి టీకా వేసినట్లు కేంద్ర మంత్రిత్వశాఖ పేర్కొంది.

- Advertisement -