12,380కి చేరిన కరోనా కేసులు…

273
love agarwal
- Advertisement -

భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు 12,380కు చేరాయని తెలిపారు కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్. మీడియాతో మాట్లాడిన ఆయన ఇప్పటివరకు కరోనాతో 414 మంది మృతి చెందారని వెల్లడించారు.

దేశ వ్యాప్తంగా 325 జిల్లాల్లో కరోనా వైరస్‌ కేసులు నమోదు కాలేదని తెలిపారు. నిన్న ఒక్కరోజే 941 కేసులు నమోదు అయ్యాయని పేర్కొన్నారు. 17 రాష్ట్రాల్లోని 27 జిల్లాల్లో గత 14 రోజుల నుంచి ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదన్నారు.

లాక్‌డౌన్‌లో పని చేసే సిబ్బంది ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నామని…అత్యవసరాల కొరత లేకుండా చూస్తున్నామని స్పష్టం చేశారు. మ‌హారాష్ట్ర‌లో కరోనా కేసులు 3000 దాటాయి. గత 24 గంటల్లో 9 మంది ప్రాణాలు కొల్పోయారు.

- Advertisement -