ఇంగ్లాండ్‌ను చిత్తుచేసిన భారత్!

121
bumra
- Advertisement -

టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్ తొలివన్డేలోనూ సత్తాచాటింది. భారత బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ బెంబేలెత్తిపోయారు. ముఖ్యంగా బుమ్రా ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. దీంతో కేవలం 110 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్ అయింది.

స్వల్ప లక్ష్యమే అయినా భారత్‌ జోరు తగ్గించలేదు. రోహిత్‌ ఆరంభం నుంచే భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. మరో ఎండ్‌లో ధవన్‌ కుదురుకునేందుకు కాస్త సమయం తీసుకున్నాడు. తొలి 17 బంతుల్లో రెండు పరుగులే చేసిన తను టోప్లే ఓవర్‌లో వరుస ఫోర్లతో టచ్‌లోకి వచ్చాడు. ఇక టీ20 తరహాలో రెచ్చిపోయిన రోహిత్‌ 17వ ఓవర్‌లో 6,4,6 బాదేసి 49 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. అదే ఊపులో 19వ ఓవర్‌లో రోహిత్‌ సిక్స్‌, ధవన్‌ విన్నింగ్‌ షాట్‌ ఫోర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. తొలి వికెట్‌కు ఈ జోడీ అజేయంగా 114 పరుగులు జోడించడం విశేషం

ఇక అంతకముందు బుమ్రా మ్యాజిక్ బంతులతో ఇంగ్లాండ్‌కు చుక్కలు చూపించాడు. తన కెరీర్‌లోనే బుమ్రా (6/19)బెస్ట్ ప్రదర్శన కనబర్చాడు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ బుమ్రాకు దక్కింది.

- Advertisement -