మెల్‌బోర్న్‌ టెస్టులో చేలరేగిన భారత బౌలర్లు..

194
Teamindia
- Advertisement -

శనివారం భారత, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. మెల్‌బోర్న్‌ వేదికగా జరుగుతోన్న బాక్సింగ్‌ డే టెస్టు మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్నది. అయితే తొలిరోజు ఆటలో భారత బౌలర్లు చేలరేగిపోయారు.. ఆతిథ్య ఆస్ట్రేలియాను తొలి ఇన్నింగ్స్ లో 195 పరుగులకే పరిమితం చేశారు. బుమ్రా 4 వికెట్లు తీయగా, అశ్విన్ 3 వికెట్లతో సత్తా చాటాడు. కెరీర్ లో తొలి టెస్టు ఆడుతున్న హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ సైతం అరంగేట్రంలో విశేషంగా రాణించాడు. సిరాజ్ కు రెండు వికెట్లు దక్కాయి. ప్రస్తుతం ఈ మ్యాచ్ కు కోహ్లీ దూమైయ్యాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం టీమిండియాకు అజింక్యా రహానే నాయకత్వం వహిస్తున్నాడు.

దీనిపై కోహ్లీ స్పందిస్తూ, భారత బౌలర్లు అద్భుతంగా రాణించారని కొనియాడాడు. మొదటి రోజు ఆటలో మనదే పైచేయి అని పేర్కొన్నాడు. అంతేకాకుండా, టీమిండియా బ్యాట్స్ మెన్ ఎంతో పట్టుదల కనబరిచి తొలిరోజు ఆటను పట్టు జారనివ్వని రీతిలో ముగించారని ప్రశంసించాడు.

రహానే కెప్టెన్సీలో టీమిండియా బౌలర్లు సమష్టిగా కదం తొక్కారు. ఆసీస్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. మిగిలిన మూడు టెస్టుల్లో కోహ్లీ స్థానంలో రహానే కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. మూడో టెస్టు నాటికి రోహిత్ శర్మ జట్టులో చేరనుండడంతో భారత బ్యాటింగ్ మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నారు.

- Advertisement -