టీ20 సిరీస్ విండీస్‌దే..

26
- Advertisement -

భారత్‌తో జరిగిన 5 టీ20ల సిరీస్‌ను కైవసం చేసుకుంది విండీస్. కీలకమైన చివరి టీ20లో భారత్ ఓటమి పాలైంది. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్…18 ఓవర్లలో రెండు వికెట్లు కొల్పోయి 171 పరుగులు చేసి విజయం సాధించింది. . ఓపెనర్‌ బ్రాండన్‌ కింగ్‌ (55 బంతుల్లో 85 నాటౌట్‌; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకోగా.. పూరన్‌ (35 బంతుల్లో 47; ఒక ఫోర్‌, 4 సిక్సర్లు) రాణించాడు. భారత బౌలర్లలో తిలక్‌వర్మ, అర్ష్‌దీప్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లు కొల్పోయి 165 పరుగులు చేసింది. . సూర్యకుమార్‌ యాదవ్‌ (45 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్‌సెంచరీతో రాణించగా.. తెలంగాణ కుర్రాడు ఠాకూర్‌ తిలక్‌ వర్మ (18 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మరోసారి ఆకట్టుకున్నాడు. మిగితా బ్యాట్స్‌మెన్ అంతా విఫలం కావడంతో భారత్ భారీ స్కోరు సాధించలేకపోయింది.

Also Read:బుక్కైనా జగన్..వాయిస్తున్నా టీడీపీ!

- Advertisement -