భారత్ – దక్షిణాఫ్రికా తొలి టీ20..

213
ind vs sa
- Advertisement -

భారత్ – దక్షిణాఫ్రికా మధ్య ఇవాళ తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఆసీస్‌తో టీ20 సిరీస్‌ గెలుచుకుని జోష్ మీదున్న భారత్..సఫారీలతో టీ20 సిరీస్‌ గెలుచుకుని సత్తాచాటాలని భావిస్తోంది. తిరువనంతపురం వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది.

ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య, పేసర్ భువనేశ్వర్ కుమార్‌లకు ఈ సిరీస్‌లో విశ్రాంతినిచ్చారు. రోహిత్, కోహ్లి ఫామ్‌లోకి రావడం ఊరటనిస్తుండగా.. పేస్ బౌలర్లు డెత్ ఓవర్లలో విఫలమవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ సమస్యను రోహిత్ సేన ఎలా అధిగమిస్తుందో చూడాలి.

భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, యుజువేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్.

దక్షిణాఫ్రికా:

రీజా హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్, టెంబా బవూమా (కెప్టెన్), రిలీ రోసౌ, ట్రిస్టాన్ స్టబ్స్, అయిడిన్ మర్‌క్రమ్, డ్వెయిన్ ప్రెటోరియస్, క్వింటన్ డికాక్, కగిసో రబాడ, టబ్రయిజ్ షంసీ, అన్రిచ్ నోర్ట్‌జే.

- Advertisement -