తాడో పేడో.. సిరీస్ ఎవరిది?

32
- Advertisement -

టీమిండియా సౌతాఫ్రికా మద్య జరుగుతున్నా వన్డే సిరీస్ లో భాగంగా నేడు తుది పోరు జరగనుంది. మూడు వన్డేలలో చెరో మ్యాచ్ లో గెలిచి సమంగా నిలిచిన ఇరు జట్లు.. నేటి మ్యాచ్ తో తాడో పేడో తేల్చుకొనున్నాయి. ప్రస్తుతం ఇరు జట్లు కూడా విజయం కోసం పట్టుదలగా ఉన్నాయి. ఇప్పటికే టీ20 సిరీస్ సమం కాగా.. ఈ సిరీస్ లో పై చేయి సాధించి టెస్ట్ సిరీస్ కు సిద్దం కావాలని చూస్తున్నాయి ఇరు జట్లు. సొంత గడ్డపై జరుతున్న మ్యాచ్ కావడంతో సిరీస్ ఎలాగైనా గెలవాలని ప్రోటీస్ జట్టు చూస్తోంది. అటు టీమిండియా 2018 సఫారీ గడ్డపై వన్డే సిరీస్ గెలిచింది లేదు. దాంతో అయిదేళ్ళ తరువాత ఈ వన్డే సిరీస్ గెలవాలని పట్టుదలగా ఉంది.

ప్రస్తుతం ఇరు జట్లు కూడా అన్నీ విభాగాల్లో బలంగా కనిపిస్తున్నాయి. టీమిండియాలో కొత్తగా వన్డేల్లోకి ఆరంగేట్రం చేసిన సాయి సుదర్శన్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇక శ్రేయస్ అయ్యర్, ఋతురాజ్ గైక్వాడ్, కే‌ఎల్ రాహుల్, తిలక్ వర్మ, రింకూ సింగ్ వంటివారితో టీమిండియా బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. అటు బౌలింగ్ లోనూ అర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్, ఆవేష్ ఖాన్ వంటివారు రాణిస్తే టీమిండియాకు తిరుగుండదు. అటు సౌతాఫ్రికా కూడా మార్క్రామ్, బర్గర్, జోర్జీ, హెన్రీచ్, క్లాసస్ ఏ క్షణంలోనైనా మ్యాచ్ ను మలుపు తిప్పగలిగే సామర్థ్యం ఉన్నవారు. బౌలింగ్ లో డస్సేన్, లిజాద్, వెర్రియన్.. వంటి వారితో టీమిండియాకు గట్టి పరిక్షే. మరి ఇరు జట్లు సమవుజ్జీలుగా ఉన్న ఈ చివరి వన్డేలో ఏ జట్టు విజయం సాధిస్తుందో చూడాలి.

తుది జట్టు అంచనా

టీమిండియా : ఋతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పటిదార్, రింకూ సింగ్, కే‌ఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దిప్ యాదవ్, యజేవేంద్ర చహల్, ముఖేష్ కుమార్, అర్షదీప్ సింగ్, ఆవేష్ ఖాన్, ఆకాశ్ దీప్,

సౌతాఫ్రికా : నంద్రే బర్గర్, ఏడెన్ మార్క్క్రమ్, టోని డి జోర్జీ, హెన్ద్రిక్స్క్లాసేన్, మిల్లర్, మ్పెమ్గ్వనా, ముల్దార్, డస్సేన్, కేశవ మహారాజ్, శంసి, లిజాద్ కైల్.

Also Read:ఈ ఆసనాలు వేస్తే.. మతిమరుపు దూరం!

- Advertisement -