బాలు త్వరగా కోలుకోవాలి: ఇళయరాజా

252
sp balu
- Advertisement -

కరోనాతో గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. బాలు ఆరోగ్య పరిస్దితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

ఎస్పీబీ త్వరగా కోలుకోవాలని పలువురు సోషల్ మీడియా వేదికగా పేర్కొంటుండగా తాజాగా ఇళయరాజా స్పందించారు. బాలు క్షేమంగా ఇంటికి రావాలని ఎమోషనల్ వీడియోను విడుదల చేశారు.

సినిమా రంగంలోకి అడుగుపెట్టడానికి ముందే మనం కచేరీలు చేశాం. సంగీతం మనిద్దరినీ కలిపింది. సంగీతం, స్వరాలు మాదిరిగా మనది విడదీయరాని బంధం. మనమెప్పటికీ స్నేహితులమే. ఈ స్నేహం మనల్ని ఎప్పటికీ వేరు చేయదు. ఆఖరికి మనం పోట్లాడుకున్నా దానిలోనూ స్నేహం ఉంది. నువ్వు త్వరలోనే తిరిగి వస్తావని నా మనసు చెబుతోందని పేర్కొన్నారు.

- Advertisement -