సీఎం జగన్‌పై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు..!

44
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌ను తాను కలవనని హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఇప్పట్లో ఆయనను కలిసే అవకాశం లేదని స్పష్టం చేశారు. సీఎం జగన్ ను కలవడానికి రావాలని తనను పిలిచారని… అయినా తాను వెళ్లలేదని చెప్పారు. టికెట్ ధరలు తక్కువగా ఉన్న సమయంలోనే తన తాజా చిత్రం ‘అఖండ’ ఘన విజయం సాధించి, మంచి వసూళ్లను రాబట్టిందని తెలిపారు. తన చిత్రాలు లిమిటెడ్ బడ్జెట్లోనే ఉంటాయని, టికెట్ ధరలు తన చిత్రాలపై ప్రభావం చూపబోవని అన్నారు. తన సినిమాల బడ్జెట్ ను తాను పెంచనని బాలయ్య చెప్పారు.

కాగా,వారం క్రితం చిరంజీవి బృందం ఆధ్వర్యంలో సినీ నటులు ప్రభాష్‌, మహేశ్‌, అలీ, ఆర్‌.నారాయణ మూర్తి, దర్శకుడు రాజమౌళి, కొరటాల శివ తదితరులు కలిసి ఏపీలో సినీ సమస్యలపై జగన్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం చర్చల సారాంశాన్ని వారు వివరిస్తూ ప్రభుత్వ తీసుకుంటున్న చర్యలపై సంతృప్తి చెందిన విషయం తెలిసిందే.

- Advertisement -