KGF3:ఐ యామ్ ఆల్సో వెయిటింగ్‌ : రవీనా

52
- Advertisement -

కేజీఎఫ్ తో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్‌ సంపాదించుకున్న హీరో యశ్‌. అయితే గతేడాది విడుదలైన కేజీఎఫ్2 భారీ వసూళ్లు సాధించి బ్లాక్‌ బస్టర్ హిట్గా నిలిచింది. ప్రస్తుతం కేజీఎఫ్ సిరీస్‌లో భాగంగా త్వరలో మూడవ భాగంను తెరకెక్కిస్తున్నట్టు హోంబలే ఫిలీం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా రవీనా టాండన్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా కేజీఎఫ్3 పైన ఆసక్తికరమైన విషయాలను పంచకుంది. అంతేకాదు టెలివిజన్ రంగంలో వివక్షపై కూడా తన దైన శైలిలో స్పందించింది.

టీవీ పరిశ్రమలో పురుషుల కంటే స్త్రీలే అధిక పారితోషికం తీసుకుంటున్నారు. సీరియల్స్‌లోనూ మహిళల ప్రాధాన్యత ఏమాత్రం తగ్గలేదని రోజురోజూకు మరింత పెరుగుతుందని అన్నారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కూడా నటీనటుల హవా కొనసాగుతందన్నారు. ఇది చాలా ఆనందించాల్సిన విషయమని తెలిపారు. కచ్చితంగా సినీ పరిశ్రమలో మార్పులు రావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. అంతేకాదు కేజీఎఫ్‌3 కోసం నేను కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నట్టు తెలిపారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా..అని అందరి లాగే తానూ ఎదురు చూస్తున్నట్టు చెప్పారు.

ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ పై ప్రశంసల వర్షం కురిపించారు. సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని అద్బుతంగా వివరిస్తారని తెలిపారు. ఇటీవలే హోంబలే ఫీల్మ్స్ వారు కేజీఎఫ్‌3కి సంబంధిచిన టీడియోను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -