ఫ్యూచర్ సిటీ అభివృద్ధిని ప్రపంచస్థాయిలో ప్రతిబింబించేందుకు తెలంగాణ ప్రభుత్వం వినూత్న నిర్ణయాలు తీసుకుంటోంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను పురస్కరించుకొని, హైదరాబాద్లోని కొన్ని ప్రధాన రోడ్లను ప్రపంచంలో పేరొందిన టెక్ దిగ్గజాలు మరియు అంతర్జాతీయ వ్యక్తుల పేర్లతో నామకరణం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది.
ఫ్యూచర్ సిటీకి వెళ్లే ప్రధాన రోడ్డుకు రతన్ టాటా రోడ్ అనే పేరు ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. భారత పరిశ్రమలకు రతన్ టాటా అందించిన సేవలకు గౌరవ సూచకంగా ఈ నామకరణం చేయనున్నట్లు అధికారవర్గాలు సూచించాయి.
అదేవిదంగా, హైదరాబాద్లోని యూఎస్ కాన్సులేట్కు వెళ్లే కీలక రోడ్డుకు డోనాల్డ్ ట్రంప్ ఎవెన్యూ అనే పేరు పెట్టాలని పరిశీలన జరుగుతోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రభావం, ఆయన పదవీకాలంలో భారత్–అమెరికా సంబంధాల పురోగతి వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రతిపాదన తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.
ఇవి మాత్రమే కాదు—టెక్ హబ్గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హైదరాబాద్కు మరింత గ్లోబల్ ఐడెంటిటీ ఇవ్వడానికి, ప్రభుత్వం ముఖ్య రహదారులకు ప్రముఖ టెక్నాలజీ సంస్థల పేర్లు పెట్టే దిశగా ఆలోచిస్తోంది. అందులో భాగంగా గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్, అలాగే ఐటీ కారిడార్లోని ఒక కీలక జంక్షన్కు విప్రో జంక్షన్ అనే పేర్లను కూడా పరిశీలిస్తున్నారు.
ఫ్యూచర్ సిటీలో ఏర్పడనున్న ఈ కొత్త నామకరణాలు, హైదరాబాద్ను గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్గా ప్రోమోట్ చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. అంతర్జాతీయ కంపెనీలు, పెట్టుబడిదారులు నగరానికి వచ్చే సందర్భంలో ఈ పేర్లు నగర ప్రతిష్టను మరింతగా పెంచే అవకాశం ఉంది. టెక్, పారిశ్రామిక రంగాల్లో తెలంగాణ సాధిస్తున్న పురోగతిని ప్రతిబింబిస్తూ, త్వరలోనే మరిన్ని ముఖ్య రోడ్లకు ప్రపంచ దిగ్గజ సంస్థల పేర్లు పెట్టే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేయనుంది.
Also Read:వేద పాఠశాలలో సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్

