అక్రమంగా పాకిస్ధాన్లోకి ప్రవేశించారనే ఆరోపణలతో ఇద్దరు భారతీయులను పాకిస్ధాన్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరిలో తెలుగు వ్యక్తి ప్రశాంత్ కూడా ఉన్నాడు. విశాఖపట్నంకు చెందిన బాబురావు కుటుంబం గత ఐదేళ్లుగా కేపీహెచ్బీలోని భగత్ సింగ్ నగర్లో ఉంటున్నారు. ప్రశాంత్ గురించిన వివరాలను సేకరిస్తున్నారు పోలీసులు.
ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ప్రశాంత్ తండ్రి బాబుబారు..తమ అబ్బాయి మంచోడని..సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తి కాదన్నారు. ప్రశాంత్ సెన్సిటివ్ అని ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాక డిస్టర్బ్ అయ్యాడని చెప్పారు.
ఢిల్లీ వెళ్లి రాయబార కార్యాలయాన్ని సంప్రదించి తమ కుమారుడిని క్షేమంగా అప్పగించాలని కోరుతామన్నారు. ప్రశాంత్ మాదాపూర్లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ రెండేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడని అప్పటినుంచి కుటుంబ సభ్యులకు అతడి గురించి ఎలాంటి సమాచారం లేదన్నారు. దీనిపై ఏప్రిల్ 29,2017లో మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు.
ఈ నెల 14న బహావుల్పూర్లో ప్రశాంత్, వారీలాల్ను నిర్భందంలోకి తీసుకున్నట్లు పాక్ పోలీసులు చెప్పిన సంగతి తెలిసిందే. వీరిద్దరిపై పాకిస్ధాన్ చట్టంలోని 334-4 కింద అభియోగాలు నమోదుచేశారు.
Hyderabad Man Prashanth Arrested In Pakistan updates…..Hyderabad Man Prashanth Arrested In Pakistan updates