హత్యా…ఆత్మహత్యా…?

210
Hyderabad Five of family commit suicide
- Advertisement -

హైదరాబాద్ శంకర్‌పల్లి మండలం ఇంద్రారెడ్డినగర్ ప్రాంతంలో విషాదం నెలకొంది. ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఉన్న చెట్ల పొదల్లో ముగ్గురి మృతదేహాలతో పాటు సమీపంలోనే కారులో మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న నార్సింగి పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

మృతులను ప్రభాకర్ రెడ్డి (30), ఆయన భార్య మాధవి (26), వారి కుమారుడు వర్షిత్ (2),  సింధుజ (16), లక్ష్మీ (42)గా గుర్తించారు. మహిళలు లక్ష్మీ, మాధవి, సింధుజ మృతదేహాలు చెట్ల పొదల్లో ఉండగా.. ప్రభాకర్ రెడ్డి, చిన్నారి వర్షిత్ మృతదేహాలు AP28DM 3775 నెంబర్ కారులో ఉన్నాయి.

అమీన్ పూర్ లోని  సిగ్నోడ్ కాలనీలో రవీందర్ రెడ్డి కుటుంబం,బీహెచ్‌ఈఎల్‌  దగ్గర అశోక్ నగర్ కు చెందిన ప్రభాకర్ రెడ్డిలు నివాసం ఉంటున్నారు.  రవీందర్ రెడ్డి భార్య లక్ష్మీ అక్క కుమారుడే ప్రభాకర్ రెడ్డి. బంధువులతో పాటు వీళ్లిద్దరూ కలిసి స్టాక్ మార్కెట్ వ్యాపారం కూడా చేసేవారు. ఈ క్రమంలోనే ప్రభాకర్ రెడ్డి అక్టోబర్ 16వ తేదీ సోమవారం మధ్యాహ్నం.. తన భార్య, కుమారుడితోపాటు రవీందర్ రెడ్డి భార్య లక్ష్మీ, ఆమె కుమార్తె సింధూజతో కలిసి ప్రాజెక్ట్ చూసి వస్తామని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వచ్చారు.  ఆ తర్వాత వారి సెల్ ఫోన్లు స్విచ్చాఫ్ అయ్యాయి. రాత్రంతా ఇంటికి రాకపోవటంతో.. మంగళవారం ఉదయం పటాన్ చెరు పోలీస్ స్టేషన్ లో రవీందర్ రెడ్డి మిస్సింగ్ కంప్లయింట్ ఇచ్చారు .

ఇది ఆత్మహత్యా.. హత్యా అనేది తేలాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకుంటే.. రవీందర్ రెడ్డి భార్య లక్ష్మీ, కూతురు సింధుజ ఎలా చనిపోయారు అనేది తెలియాల్సి ఉంది.

- Advertisement -