బోనాలు…ప్రభుత్వ మార్గదర్శకాలివే

381
hyderabad bonalu
- Advertisement -

కరోనా నేపథ్యంలో బోనాల నిర్వహణపై ప్రభుత్వం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బోనాల నిర్వహణపై మార్గదర్శకాలు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం.

ఈ నెల 25న గోల్కొండలో ఉత్సవాలు ప్రారంభమవుతాయని, కేవలం పది మంది మాత్రమే ఉత్సవాల్లో పాల్గొనాలని తెలిపింది. అన్ని దేవాయాల్లోనే ప్రభుత్వమే పట్టువస్త్రాలు సమర్పిస్తుందని తెలిపింది.

బోనాల ఉత్సవాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించాలని…గటాల ఊరేగింపునకు ఎలాంటి అనుమతి లేదని పేర్కొంది. ప్రజలంతా తమ మొక్కలు ఇళ్లల్లోనే చెల్లించుకోవాలని ప్రభుత్వం సూచించింది.

- Advertisement -