హైదరాబాద్ వరుసగా 5వ విజయం..

88
rcb
- Advertisement -

ఐపీఎల్ 15వ సీజన్‌లో భాగంగా వరుసగా ఐదో విజయాన్ని నమోదుచేసింది హైదరాబాద్. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో అలవోకగా విజయాన్ని సాధించింది. ఆర్సీబీ విధించిన 69 పరుగుల లక్ష్యాన్ని కేవలం 8 ఓవర్లలో ఒక వికెట్ కొల్పోయి 72 పరుగులు చేసి విజయాన్ని సాధించింది. అభిషేక్ శర్మ 28 బంతుల్లో 8 పోర్లు, ఒక సిక్సర్‌తో 47 పరుగులు చేయగా విలియమ్సన్‌ 16,రాహుల్ త్రిపాఠి 77 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.

ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ అట్టర్ ఫ్లాప్ అయింది. హైదరాబాద్ బౌలర్ల ధాటికి కేవలం 68 పరుగులకే కుప్పకూలింది. టాప్ ఆర్డర్ సహా బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యారు. మాక్స్‌వెల్ 12,ప్రభుదేశాయ్ 15 పరుగులు చేశారు. హైదరాబాద్ జట్టుకి ఇది వరుసగా 5వ విజయం కావడం విశేషం. ఈ విజయంతో హైదరాబాద్‌ (10) పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. 12 పాయింట్లతో టాప్ 1 లో గుజరాత్ టైటాన్స్ జట్టు ఉంది.

- Advertisement -