హైదరాబాద్ మెట్రో..రికార్డు

189
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన మెట్రోరైలు తొలిరోజే రికార్డు సృస్టించింది. అంచనాలను మించుతు తొలిరోజు ఏకంగా 2 లక్షల మంది మెట్రోలో ప్రయాణించారు. దేశంలో ఇప్పటివరకు మెట్రో ప్రారంభమైన నగరాల్లో 50వేలకు మించి ప్రజలు ప్రయాణించలేదు. కానీ హైదరాబాద్‌లో మాత్రం 2లక్షలకు పైగా ప్రజలు ప్రయాణించడంపై అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Hyd metro creates record
మెట్రో రైలులో తొలిరోజే 2లక్షల మంది ప్రయాణించడం పట్ల తెలంగాణ మంత్రి కేటీఆర్‌ సంతోషం చేశారు. మెట్రోస్టేషన్లలో రద్దీని నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని మెట్రో అధికారులు, ఎల్‌ అండ్‌ టీ ప్రతినిధులకు సూచించారు. చిన్నారులు, వృద్ధులు, చిన్నారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

దేశంలో ఏ నగరంలో లేనట్లుగా ఏకంగా 30 కిలోమీటర్ల మెట్రో మార్గం అందుబాటులోకి తీసుకురావడం, అంతర్జాతీయ ప్రమాణాలు, విమానాశ్రయాలను తలపించేలా మెట్రోస్టేషన్లను తీర్చిదిద్దడంతో ప్రజలు మెట్రోలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్నారు.

- Advertisement -