ముగిసిన హుజుర్‌నగర్‌ ఉప ఎన్నికల పోలింగ్..

458
huzurnagar
- Advertisement -

హుజుర్‌నగర్ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 85 శాతం పోలింగ్ నమోదైంది. 5 గంటల లోపు క్యూలైన్లో నిలుచున్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు అధికారులు.

ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా ఉదయం 9 గంటల వరకు 13.44 శాతం, 11 గంటలకు 31.34 శాతం మధ్యాహ్నం 1 గంటలకు 52.89 శాతం పోలింగ్ నమోదు కాగా, మధ్యాహ్నం 3గంటలకు 70శాతం పోలింగ్ నమోదైంది.

పోలింగ్ పూర్తయిన గ్రామాల్లోని ఈవీఎం మిషన్లను స్ట్రాంగ్ రూంలకు తరలిస్తున్నారు. ఈ నెల 24న  ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుండగా మధ్యాహ్నం 12 గంటలలోపు తుది ఫలితం వెలువ డుతుంది.

- Advertisement -