యాదాద్రికి పోటెత్తిన భక్తులు…

228
yadadri temple
- Advertisement -

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి కొత్త రూపును సంతరించుకుంటున్నది.. ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా రూపు దిద్దుకుంటున్న క్రమంలో ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

కార్తీక శనివారం సందర్భంగా యాదాద్రి లక్ష్శీ‌నా‌ర‌సిం‌హుని సన్ని‌ధికి భక్తులతో కిక్కి‌రి‌సి‌పో‌యింది. స్వామివారి దర్శనానికి తర‌లి‌వ‌చ్చిన భక్తుల వాహ‌నాలు రోడ్డుపై బారులు బారులు తీరాయి.

మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి రావడంతో లక్ష్మీనారసింహుని దర్శనానికి మూడు గంటల సమయం పడుతున్నది. దీంతో అధికారులు లఘుదర్శన సౌకర్యం కల్పిస్తున్నారు. భౌతికదూరం పాటిస్తూ భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు.

- Advertisement -