అన్ని రాష్ట్రా‌లకు అజయ్ భల్లా లేఖ..

177
Home Secretary Ajay Bhalla
- Advertisement -

అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖ రాశారు. రాత్రి పూట కర్ఫ్యూను కొనసాగించే విషయంపై లేఖలో ప్రస్తావించారు. రాత్రి వేళల్లో గుంపులుగా, సమూహాలుగా తిరిగే వారిని ఆపడానికే ఈ నిబంధనలు విధించినట్లు లేఖలో పేర్కొన్నారు.రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ, సామాజిక దూరం పాటించడం కొనసాగించాల్సిందేనని అజయ్ భల్లా లేఖలో స్పష్టం చేశారు.

వస్తువులు సరఫరా చేసే వాహనాలు, బస్సులు, రైళ్లు, విమానాల ద్వారా ప్రయాణించే ప్రజలకుమినహాయింపు ఉంది.అనవసర కార్యకలాపాల నివారణకు కోసం ఈ కర్ఫ్యూ అమలు చేస్తున్నామని హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖలో పేర్కొన్నారు.

- Advertisement -