మొక్కలు నాటిన హోంమంత్రి అలీ..

126
- Advertisement -

పార్లమెంటు సభ్యులు జె.సంతోష్ కుమార్ జన్మదినం సందర్భంగా బుధవారం నాడు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమ్మద్ అలీ మొక్కలు నాటారు. బంజారాహిల్స్ లోని తన క్వార్టర్ లో మొక్కలు నాటి పార్లమెంట్ సభ్యులులు శ్రీ సంతోష్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ….. ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ చాలెంజ్ దేశవ్యాప్తంగా చక్కటి పేరు సంపాదించిందని తెలియజేశారు.

ఎంతోమంది తమ పుట్టినరోజు నాడు మొక్కలు నాటడం ద్వారా ఈ కార్యక్రమానికి మద్దతుగా నిలుస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ శ్రీ సంతోష్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటుతూ శుభాకాంక్షలు అందజేస్తున్నానని వివరించారు. మున్ముందు ఎంతోమంది మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడంతోపాటు ఈ కార్యక్రమానికి అండగా నిలవాలని హోం మంత్రి కోరారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -