అమిత్ షా నివాసంలో ఉన్నతస్థాయి సమావేశం

361
amitshah
- Advertisement -

అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం కేసులో సుప్రీం కోర్టు ఇవాళు తీర్పు వెల్లడించనున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన తన నివాసంలో ఉన్నతస్థాయి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అరవింద్ కుమార్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

కేంద్ర హోంశాఖ కార్యాలయంలో ప్రత్యేక సెల్ కూడా ఏర్పాటు చేశారు.తీర్పు వచ్చాక అల్లర్లు చెలరేగే ప్రమాదం ఉండడంతో దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే అన్నీ రాష్ట్రాల హోంశాఖ ను అలర్ట్ చేసింది కేంద్రం. తుది తీర్పు వెలువడిన అనంతరం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందొబస్తును ఏర్పాటు చేశారు.

- Advertisement -